Breaking News

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయండి

సారథి, రామడుగు: రైతులకు అసౌకర్యం కలిగించకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ నిర్వాహకులకు చూచించారు. మండలంలోని వెదిర ఫ్యాక్స్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ కోమల్ రెడ్డి తో కలిసి సందర్శించారు. ఇప్పటివరకు ఎంత మొత్తంలో కొనుగోలు చేశారనే విషయాలను నిర్వాహకుల నుంచి తెలుసుకున్నారు. కొనుగోళ్లలో జాప్యం జరగకుండా చూడాలని సూచించారు. కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జేసీ దృష్టికి తెచ్చారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారి యాస్మిన్, రైతులు పాల్గొన్నారు.