Breaking News

పిడుగు పడి యువకుడు మృతి

సామాజిక సారధి , బిజినపల్లి :పిడుగుపాటుకు గురై యువకుడు మృతి చెందిన సంఘటన లింగసాయింపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది .. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం బిజినపల్లి మండల పరిధిలోని లింగ సాయం పల్లి గ్రామానికి చెందిన మేకల బాలకృష్ణ (22) అనే యువకుడు రోజువారిగా గురువారం ఉదయం గొర్రెలను తీసుకొని మేత కొరకు గ్రామ శివారులోని పంట పొలాల్లోకి వెళ్ళాడు . ఒక్కసారిగా సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం రావడంతో గొర్రెలను చెట్ల కిందికి పంపించి వర్షం నుండి పక్కనే ఉన్న చెట్టు దగ్గరకు వెళుతుండగా అకస్మాతంగా పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు . కళ్ళముందే తన తమ్ముడు పిడుగుపాటుకు గురై చనిపోవడం చూసి మృతుడి అన్న ఒక్కసారిగా షాకు కు గురయ్యాడు . జరిగిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి వెళ్లి వేసవికాలంలో పిడుగుపాటు అయిందని ఇదేమి కాలం రా బాబు కష్టం చేసుకునే వారి మీద పిడుగు పడి మృతి చెందనం బాధాకరమైన విషయమని పలువురు దుఃఖ సముద్రంలో మునిగిపోయారు .