Breaking News

పశ్చిమబెంగాల్​లో లాక్​డౌన్​ పొడగింపు

పశ్చిమబెంగాల్​లో లాక్​డౌన్​ పొడిగింపు

కోల్​కతా: కరోనా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్​లో ఆగస్ట్​ 31 వరకు లాక్​డౌన్​ పొడిగించనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వారంతపు( వారంలో రెండురోజులు) లాక్​డౌన్​ విధిస్తున్నారు. ఈద్​ సందర్భంగా ఆగస్ట్​ 1న లాక్​డౌన్​ విధించబోమని ఆమె స్పష్టం చేశారు. వారంలో ఏయేరోజు లాక్​డౌన్​ విధిస్తామో ప్రభుత్వం ముందుగానే తెలియజేస్తుందని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నదన్నారు. కరోనా విపత్తువేళ కేంద్రప్రభుత్వం తమ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నదని మమత ఆరోపించారు.