Breaking News

హనుమాన్​చాలిసా పఠిస్తే కరోనా రాదట

ప్రగ్యా టాకూర్​ వివాదాస్పద వ్యాఖ్యలు

భోపాల్‌: బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హనుమాన్​ చాలిసా పఠిస్తే కరోనా దరిచేరదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు శ‌నివారం ట్వీట్​ చేశారు. ‘క‌రోనాతో పోరాడేందుకు అంద‌రూ జూలై 25 నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కు త‌ప్ప‌నిస‌రిగా రోజుకు ఐదు సార్లు హ‌నుమాన్ చాలీసా ప‌ఠించండి. ఆఖ‌రి రోజు ఇంట్లో దీపాల‌ను వెలిగించి రాముడికి హార‌తి ప‌ట్టండి. దేశ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు హ‌నుమాన్ చాలీసాను ఒకే స్వ‌రంలో ప‌ఠిస్తే దానికి క‌చ్చితంగా ఫ‌లితం ఉంటుంది. క‌రోనా నుంచి మ‌నం విముక్తి పొందుతాం. ఇది రాముడికి చేసే ప్రార్థ‌న’ అని చెప్పుకొచ్చారు. ఆమె వ్యాఖ్యలపై సోషల్​మీడియాలో ట్రోలింగ్​ మొదలైంది. క‌రోనా వైర‌స్ రాకూడ‌దంటే భౌతిక ‌దూరం, ఫేస్ మాస్క్ ధ‌రించ‌డం, ఎప్ప‌టిక‌ప్పుడు చేతుల‌ను శుభ్రపరుచుకోవాలని వైద్యులు చెబుతుంటూ ప్రగ్యా ఇలా చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.