Breaking News

67వేల కేసులు.. వెయ్యి మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనావ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్నది. కొత్తగా 67,151 కొత్తకేసులు నమోదుకాగా.. 1059 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 32,34,475 చేరింది. మృతుల 59,449 కు చేరింది. ప్రస్తుతం 7,07,267 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 24,67,759 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొంది కోలుకున్నారు. ఈ మేరకు బుధవారం కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు 3.76 కోట్ల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత్‌ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది.