Breaking News

60వేల కొత్త కేసులు

కొత్తగా 60 వేల కేసులు

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నది. గత 24 గంటల్లో 60 వేల కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులసంఖ్య 20,88,611కు చేరుకున్నది. ఇప్పటివరకు 42,518 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. 14,27,005 మంది డిశ్చార్జి అయ్యారు. 6,19,088 యాక్టివ్​ కేసులున్నాయి. 24 గంట్లో 933 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈమేరక శనివారం కేంద్ర, వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్​ విడుదల చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తున్నది. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని దవాఖానకు వెళ్లాలని కోరింది.