ఢిల్లీ: మనదేశంలో ఇప్పటివరకు 50,921 మంది కరోనాతో మృతిచెందారు. గత 24 గంటల్లో 57,981 కొత్తకేసులు నమోదయ్యాయి. కోలుకుంటున్నవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నదని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 19,19,842 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కాగా మొత్తం కేసుల సంఖ్య 26,47,663కు చేరుకున్నది. 6, 76,900 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని.. తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని కేంద్రవైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టంచేశారు.