Breaking News

3.68 కోట్ల కరోనా పరీక్షలు

3.68 కోట్ల కరోనా పరీక్షలు

ఢిల్లీ: భారత్​లో కరోనా అంతకంతకూ విస్తరిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 60,975 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31,67,323 కు చేరుకుంది. ఇప్పటివరకు 24 లక్షల మంది కోలుకోగా.. ఏడు లక్షల యాక్టివ్​ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 848 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. మొత్తం మృతుల సంఖ్య 58,390కు చేరింది. అయితే ప్రస్తుతం పాజిటివిటీ రేటు 8.6 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 68 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.