![2,795 కరోనా కేసులు.. 8 మంది మృతి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/COVID-19F20.jpg?fit=677%2C437&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం(24 గంటల్లో) కొత్తగా 2,795 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా రాష్ట్రంలో 8 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 788 మంది మృతిచెందారు. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,14,483కు చేరింది. మొత్తం యాక్టివ్ కేసులు 27,600 మేర ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 30,772 శాంపిళ్లను కలెక్ట్ చేయగా 1,075 పెండింగ్ లో ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 449, కరీంనగర్ 136, ఖమ్మం 152, మహబూబాబాద్ 102, మంచిర్యాల 106, మేడ్చల్ 113, నల్లగొండ 164, నిజామాబాద్ 112, రంగారెడ్డి 268, సిద్దిపేట 113, వరంగల్ అర్బన్ 131.. చొప్పున అత్యధికంగా కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం 20 866 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/ts-2f-4.jpg?resize=407%2C695&ssl=1)