![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/indra-2-FINAL.jpg?fit=157%2C158&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: ఈనెల 25న ప్రారంభించే ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం లేఖలు రాశారు. ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని కోరారు. హరితహారంలో ఇప్పటి వరకు 182 కోట్ల మొక్కలు నాటినట్లు చెప్పారు.