Breaking News

22న సంతోష్​బాబు ఇంటికి సీఎం కేసీఆర్​

సారథి న్యూస్​, సూర్యాపేట: గాల్వన్​ లోయలో చైనా సైనికులు జరిపిన దాడిలో మృతిచెందిన కల్నల్​ సంతోష్​ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఈనెల 22న సీఎం కేసీఆర్​ సూర్యాపేటకు రానున్నారని మంత్రి జగదీశ్​రెడ్డి వెల్లడించారు. శనివారం కల్నల్​ కుటుంబసభ్యులను మంత్రి పరామర్శించారు. భవిష్యత్​లో కుటుంబ అవసరాల రీత్యా రూ.ఐదుకోట్ల నగదు, ఇంటి జాగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. అలాగే సంతోష్​బాబు సతీమణికి గ్రూపు 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించారని వెల్లడించారు.