Breaking News

హైవేల వెంట పూల మొక్కలు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలోని నేషనల్​హైవేల వెంట ఇరువైపులా రంగురంగుల పూల మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎర్రమంజిల్ ఆర్అండ్ బీ ఆఫీసులో సమీక్షించారు. రోడ్లకు ఇరువైపులా ఆహ్లాదకరమైన మొక్కలు ఉండేలా చూడాలని సీఎం కేసీఆర్​ఆదేశాలు ఇచ్చారని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్ర పరిధిలోని నేషనల్ హైవేలపై 50వేల మొక్కలు, 25 కలెక్టరేట్లలో వెయ్యి మొక్కల చొప్పున మొత్తం 75వేల మొక్కలను హరితహారంలో నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆర్అండ్ బీ ఈఎన్​సీ గణపతిరెడ్డిని కోరారు.