Breaking News

స.హ.చ అధ్యక్షుడిగా పరుశురాం

సారథిన్యూస్, రామడుగు: సమాచార హక్కు చట్టం రామడుగు మండల అధ్యక్షుడిగా అనుపురం పరుశరాంను నియమిస్తున్నట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల, గ్రామ స్థాయి లో సమాచార హక్కు రక్షణ చట్టంపై అవగాహన కల్పిస్తామన్నారు. పరుశురాంను జిల్లా అధ్యక్షుడు కోలిపాక శేఖర్, చొప్పదండి నియోజకవర్గ ఇన్​చార్జ్​ వేణుగోపాల్ గౌడ్ అభినందించారు.