Breaking News

సొంతూళ్లకు వలసకూలీలు

సారథి న్యూస్, మహబూబ్ నగర్: వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మహబూబ్ నగర్ సమీపంలోని ధర్మాపూర్, ఎర్రవల్లి తాండా, దొడ్డలోనిపల్లి గ్రామాల్లోని ఇటుక బట్టీల్లో దాదాపు 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిని సొంతూళ్లకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వీరంతా మహబూబ్ నగర్ నుంచి ఘట్​కేసర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సుల్లో .. అక్కడి నుండి రైళ్ళలో స్వస్థలాలకు వెళ్లనున్నారు.శుక్రవారం మంత్రి శ్రీనివాస్​గౌడ్​ వీరికోసం ఏర్పాటుచేసిన బస్సులను పరిశీలించారు. కార్మికులందరూ మాస్క్ ధరించాలని.. శానిటైజర్ అందుబాటులో ఉంచుకోవాలని మంత్రి సూచించారు.