Breaking News

సచిన్​పైలట్​కు ఊరట

ఢిల్లీ: రాజస్థాన్​ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. సచిన్ పైలట్​ వర్గంపై ఈనెల 24 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ రాజస్థాన్​ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో హైకోర్టు నిర్ణయాన్ని సవాలుచేస్తూ స్పీకర్​ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై గురువారం విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం రాజస్థాన్​ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో సచిన్​ పైలట్​ వర్గానికి మరోసారి ఊరట లభించింది. స్పీకర్​ లేవనెత్తిన అంశాలపై సుధీర్ఘ విచారణ చేపడతామని చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. రాజస్థాన్​ స్పీకర్​ తరఫున సీనియర్​ న్యాయవాది కపిల్​ సిబల్​ వాదనలు వినిపించారు. స్పీకర్​ విచక్షణాధికారాలపై కోర్టు జోక్యం చేసుకోరాదని పేర్కొన్నారు. ఆయన వాదనలు విన్న జస్టిస్​ అరుణ్​ మిశ్రా ధర్మాసనం ఈ అంశంపై సుధీర్ఘ విచారణ చేపడతామని చెప్పింది.