![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/KCR-PRAGATHI-BHAVAN-dddf.jpg?fit=1000%2C600&ssl=1)
సారథిన్యూస్, హైదరాబాద్: గాల్వన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్బాబు భార్య సంతోషికి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు నియామక ఉత్తర్వులను సిద్ధం చేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. సీఎం విచక్షణాధికారాలతో ఎవరినైనా గ్రూప్-1 స్థాయి దాకా ఉన్న పోస్టుల్లో నియమించే అవకాశం ఉన్నది. ఆ అధికారంతోనే సంతోషిని డిప్యూటీ కలెక్టర్గా నియమించనున్నారు. సంతోష్బాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం సూర్యాపేట వెళ్లనున్నారు. ఈ సందర్భంగానే సంతోషికి నియామక ఉత్తర్వులను స్వయంగా అందజేయనున్నారు. అలాగే, హైదరాబాద్ జిల్లా షేక్పేటలో 500 గజాల స్థల కేటాయింపు జీవో కాపీతోపాటు రూ.5 కోట్ల చెక్కును అందించనున్నారు.