Breaking News

సంగ్రాం మహారాజ్​ ధన్యజీవి

సంగ్రామ్​ మహారాజ్​ ఆశీర్వాదం తీసుకుంటున్న ఖేడ్​ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి

నారాయణఖేడ్, సారథి న్యూస్: అయోధ్యలోని రామమందిర భూమిపూజ కార్యక్రమానికి వెళ్లిన కొండాపూర్​ హనుమాన్​ ఆలయ పీఠాధిపతి సంగ్రాం మహారాజ్​ ధన్యజీవి అని నారాయణ్​ఖేడ్​ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్​రెడ్డి పేర్కొన్నారు. అయోధ్య రామమందిర భూమిపూజకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఆయన ఒక్కరికి పిలుపువచ్చిన విషయం తెలిసిందే. సంగ్రాం మహారాజ్​ అయోధ్యలోని రామమందిర భూమిపూజకు హాజరై శనివారం ఆశ్రమానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా శనివారం ఆయనను ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి మర్యాపూర్వకంగా కలుసుకున్నారు. ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. సంగ్రాం మహారాజ్​ లాంటి గొప్పవ్యక్తి తెలంగాణ గడ్డమీద పుట్టడం మన అదృష్టమన్నారు. అనంతరం స్థానిక హనుమాన్​ మందిరంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.