Breaking News

శేఖర్​ కమ్ముల ఇంట విషాదం

శేఖర్​ కమ్ముల

ప్రముఖ దర్శకుడు శేఖర్​ కమ్ముల ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. ఆయన తండ్రి శేషయ్య శనివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడతున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం సికింద్రాబాద్​ బన్సీలాల్​ శ్మశానవాటికలో శేషయ్యకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పలువురు సినీ ప్రముఖులు శేఖర్​ కమ్ములకు ఫోన్​ చేసి సంతాపం తెలిపారు. ప్రస్తుతం శేఖర్​ కమ్ముల నాగచైతన్య, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘లవ్​స్టోరీ’ అనే సినిమా తీస్తున్నాడు. సినిమా షూటింగ్​ పూర్తయినప్పటికీ కరోనా లాక్​డౌన్​తో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.