![వ్యాపార వేళలు పెంచండి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/KNL-SV2.jpg?fit=677%2C432&ssl=1)
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని వ్యాపారసంస్థలు రెండు నెలల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునే అవకాశం ఉందని, వ్యాపారుల ఆర్థికపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యాపార సమయాన్ని సాయంత్రం వరకు పెంచాలని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి కోరారు. వ్యాపారులు అద్దెలు, కరెంట్ బిల్లులు చెల్లించలేకపోగా అందులో పనిచేసే వారికి జీతాలు చెల్లించే పరిస్థితి లేక తమ వ్యాపారాలను వదులుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అన్లాక్ సమయంలో పెద్ద నగరాల్లో సాయంత్రం వరకు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని అన్నారు. సరైన నిర్ణయం తీసుకుని వ్యాపారులకు న్యాయం చేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ను కోరారు.