Breaking News

వ్యాపార వేళలు పెంచండి

వ్యాపార వేళలు పెంచండి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలోని వ్యాపారసంస్థలు రెండు నెలల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునే అవకాశం ఉందని, వ్యాపారుల ఆర్థికపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యాపార సమయాన్ని సాయంత్రం వరకు పెంచాలని మాజీ ఎమ్మెల్యే ఎస్​వీ మోహన్​రెడ్డి కోరారు. వ్యాపారులు అద్దెలు, కరెంట్ బిల్లులు చెల్లించలేకపోగా అందులో పనిచేసే వారికి జీతాలు చెల్లించే పరిస్థితి లేక తమ వ్యాపారాలను వదులుకునే పరిస్థితి వచ్చిందన్నారు. అన్​లాక్ సమయంలో పెద్ద నగరాల్లో సాయంత్రం వరకు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని అన్నారు. సరైన నిర్ణయం తీసుకుని వ్యాపారులకు న్యాయం చేయాలని కలెక్టర్ ​జి.వీరపాండియన్​ను కోరారు.