![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/medico-murderdff.jpg?fit=700%2C452&ssl=1)
లక్నో: వైద్యవిద్యార్థిని దారుణహత్యకు గురైన ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రాలో గురువారం వెలుగుచూసింది. కొంతకాలంగా ఆమెను ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడే కిడ్నాప్చేసి హత్యచేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈఘటనపై ప్రస్తుతం యూపీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఢిల్లీలోని శివపురి ప్రాంతానికి చెందిన డాక్టర్ యోగిత గౌతమ్(25) ఆగ్రా ఎస్ ఎన్ మెడికల్ కళాశాలలో గైనకాలజీ విభాగంలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. అదే కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదు. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఆమె హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు.యోగిత మృతదేహం బమ్రోలి అహిర్ ప్రాంతంలో పోలీసులకు లభ్యమయ్యింది. కాగా యోగితను కొంతకాలంగా ఆమె సీనియర్ డాక్టర్ వివేక్ తివారి ప్రేమపేరుతో వేధిస్తున్నట్టు సమాచారం. యోగిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు .. వివేక్ తివారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.