![వైద్యారోగ్యశాఖను బలోపేతం చేయాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/ETALA-2.jpg?fit=677%2C295&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖను పూర్తిస్థాయిలో బలోపేతం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్అన్నారు. శనివారం వెంగల్రావు నగర్లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ఆఫ్ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆయుష్ ఇన్చార్జ్డైరెక్టర్ ప్రశాంతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడిషన్ డాక్టర్రమేష్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస్ రావు, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, కమిటీ సభ్యులు డాక్టర్ కరుణాకర్రెడ్డి, డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.