![వేడుకలు వద్దు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/WARANGAL-EAST-MLAAAFF.jpg?fit=700%2C546&ssl=1)
సారథి న్యూస్, వరంగల్: తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం (ఆగస్టు 5న) ఎలాంటి వేడుకలు, ఉత్సవాలు చేయవద్దని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కార్యకర్తలు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వీలైతే ఎవరి ఇండ్ల వద్ద వారు మొక్కలు నాటాలని సూచించారు. భారీగా గుమిగూడడం, కేక్కట్ చేయడం లాంటి కార్యక్రమాలను చేపట్టవద్దని కోరారు.