Breaking News

వీధి వ్యాపారులకు ఊరట

వీధి వ్యాపారులకు ఢిల్లీ ప్రభుత్వం ఊరట

ఢిల్లీ: కరోనా లాక్​డౌన్​తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వీధివ్యాపారులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. వీధి వ్యాపారులు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విక్రయాలు చేసుకోనేందుకు అవకాశం కల్పించింది. కంటైన్మెంట్​ జోన్లలో మాత్రం నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే వారాంతపు సంతలకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.