![వీధి వ్యాపారులకు ఢిల్లీ ప్రభుత్వం ఊరట](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/ARAVIND-KEJRIWALFF-1.jpg?fit=300%2C168&ssl=1)
ఢిల్లీ: కరోనా లాక్డౌన్తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వీధివ్యాపారులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. వీధి వ్యాపారులు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విక్రయాలు చేసుకోనేందుకు అవకాశం కల్పించింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే వారాంతపు సంతలకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.