Breaking News

వివేకానందుని జీవితం యువతకు ఆదర్శం

వివేకానందుని జీవితం యువతకు ఆదర్శం

సారథి న్యూస్, కరీంనగర్: నేటి యువతకు స్వామి వివేకానందుని జీవితం ఆదర్శప్రాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం సందర్భంగా దేశంలోని యువకులు, ప్రజలను సంఘటితం చేయడానికి ఆయన ప్రసంగాలు దోహదపడ్డాయని గుర్తుచేశారు. మంగళవారం స్వామి వివేకానందుని 158వ జయంతి సందర్భంగా కరీంనగర్ టౌన్​లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్​ మాట్లాడుతూ.. భారతదేశం ఒక గొప్ప జ్ఞానసంపద కలిగిన దేశమని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయులని కొనియాడారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఉండాలంటే ఆయన జీవిత చరిత్రను చదవాలని పిలుపునిచ్చారు. స్వామి జీవించిన 39 ఏళ్లలో వారు అందించిన ఆదర్శ జీవితం చాలా స్ఫూర్తిదాయకమన్నారు.