Breaking News

వాళ్లెందుకు మారారో..!

వాళ్లెందుకు మారారో..!

పెళ్లి తర్వాత కూడా ఏ మాత్రం పాపులారిటీ తగ్గని హీరోయిన్ సమంత. అలాగే ఏ క్యారెక్టరైనా చాలెంజ్ తీసుకుంటుంది. ‘యు టర్న్’, ‘మజిలీ’, ‘ఓ బేబి’, ‘జాను’ సినిమాలే అందుకు నిదర్శనం. ఈసారి కూడా డిఫరెంట్ కాన్సెప్టుతో ఆడియెన్స్ ముందుకు రావాలని ప్లాన్ చేస్తోంది సమంత. తమిళ దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ డైరెక్షన్ లో ఓ ప్యాన్ ఇండియా మూవీ చేసేందుకు కమిట్ అయ్యిందన్న వార్తలు వినిపించాయి. సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ కి కూడా వెళ్లనుందనే ప్రచారం జరిగింది. అయితే రీసెంట్ గా అశ్విన్ ప్లేస్ లో నందినిరెడ్డి చేరిందనే టాక్ ఫిలింనగర్ లో జోరుగా నడుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్​​లో ఇప్పటికే ఓ బేబీ సినిమా వచ్చింది.

సినిమా హిట్టవడంతో మరోసారి వీరికాంబో రిపీట్ చేయాలనుకున్నారు. ఈసారి హారర్‌ థ్రిల్లర్‌ చిత్రానికి వీరిద్దరు ప్లాన్ చేసినట్టు తెలిసింది. సోనీ పిక్చర్స్‌ బ్యానర్ లో తెలుగు, తమిళంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారట. నందినిరెడ్డి ఈసారి సమంతతో ఏం మ్యాజిక్ చేయనుందో మరి. ఇదిలా ఉంటే.. అశ్విన్ సినిమా నందిని రెడ్డి చేతుల్లోకి ఎందుకెళ్లిందో అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.