Breaking News

వాజేడు ఐటీఐలో ఐదో విడత అడ్మిషన్లు

వాజేడు ఐటీఐలో ఐదో విడత అడ్మిషన్లు

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో చేరేందుకు ఐదవ విడత అడ్మిషన్లు ప్రారంభమైనట్టు ప్రిన్సిపాల్ పి.శేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు జనవరి 19వ తేదీలోపు వెబ్​సైట్​ http://iti.telangana.gov.in లో అడ్మిషన్ పొందాలని సూచించారు. మొదటి నాలుగు విడతల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇదివరకే జరిగిన నాలుగు విడతల్లో సర్టిఫికెట్​వెరిఫికేషన్​కాని విద్యార్థులు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ప్రిన్సిపల్​ శేఖర్​ తెలిపారు.