Breaking News

వరదబాధితులను ఆదుకోండి

సారథి న్యూస్​, రామడుగు: వర్షంతో నష్టపోయిన రైతన్నలు వెంటనే ఆదుకోవాలని సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి కొయ్యడ సృజన్​ కుమార్​ పేర్కొన్నారు. బుధవారం ఆయన కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం పర్యటించి పంటలను పరిశీలించారు. వర్షాలతో రైతులు ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు గంటే రాజేశం, మచ్చ రమేశ్​, బాల్ రెడ్డి, నాగి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.