Breaking News

వరదబాధితులను ఆదుకోండి

సారథిన్యూస్​, ఖమ్మం/ఏన్కూర్: వర్షాలతో సర్వస్వం కోల్పోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్​ చేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా ఏన్కూర్​ మండలం భగవాన్​ నాయక్​ తండాలో పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, ఎస్​ఎఫ్​ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, సీపీఎం ఏన్కూర్ మండల కార్యదర్శి దొంతిబోయిన నాగేశ్వరరావు, రైతు సంఘం మండల కార్యదర్శి గుండా సత్యనారాయణ రెడ్డి , సీఐటీయూ మండల కార్యదర్శి ఎర్పుల రాములు, నాయకులు గుడ్ల వెంకటేశ్వరరావు, లెనిన్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.