![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/MLA-MARRI.jpg?fit=767%2C371&ssl=1)
సారథిన్యూస్, బిజినేపల్లి: లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు కొత్త సబ్స్టేషన్లను నిర్మిస్తున్నామని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం సమీపంలోని నూతన కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడూతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారమైందని చెప్పారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ హరిచరణ్ రెడ్డి , సర్పంచ్ గోవిందు లావణ్య నాగరాజు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కిరణ్, వైస్ ఎంపీపీ చిన్నారెడ్డి , ఎంపీటీసీలు తిరుపతి రెడ్డి, నాయకులు శేఖర్ రావు, మహేష్ రావు తదితరులు పాల్గొన్నారు