Breaking News

లిక్కర్‌‌ ఫ్యాక్టరీలోకి వెళ్లి బుక్కయ్యారు

జార్ఖండ్‌: లిక్కర్​ఫ్యాక్టరీని తనిఖీ చేయడం పోలీసులకు తలనొప్పులు తెచ్చింది. సదరు లిక్కర్​ ఫ్యాక్టరీ యజమానికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడంతో ఇప్పుడు తనిఖీకి వెళ్లిన 42 మంది పోలీసులు కరోనా వచ్చిందేమోనని భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జార్ఖండ్‌ రాష్ట్రంలోని కోడేర్మా జిల్లాకు చెందిన 45 మంది పోలీసులు శనివారం అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ లిక్కర్‌‌ ఫ్యాక్టరీపై రైడ్‌ చేశారు. వాళ్లలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఆ కేసులో అరెస్టైన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో అతడితో కాంటాక్ట్​ అయిన దాదాపు 42 మందిని క్వారంటైన్‌లోకి పంపామని డిప్యూటీ కమిషనర్‌‌ ఆఫ్‌ పోలీస్‌ రమేశ్‌ గోపాల్‌ చెప్పారు. ఐదురోజుల తర్వాత పోలీసుల శాంపిల్లు టెస్టులకు పంపిస్తామని చెప్పారు. ఈ పోలీసులు జైనగర్‌‌, చంద్వారా పోలీస్‌స్టేషన్‌కు చెందిన వారు.