Breaking News

రో‘హిట్’ మెరుపులు.. ముంబై 195/5

రో‘హిట్’ మెరుపులు.. ముంబై 210

అబుదాబి: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా కలకత్తా నైట్​రైడర్స్, ముంబై ఇండియన్స్​ మధ్య జరిగిన మ్యాచ్​లో ముంబై కెప్టెన్ ​రోహిత్ శర్మ​వీరోచిత బ్యాటింగ్ 80 (54 బాల్స్​లో 6 సిక్స్​లు, మూడు ఫోర్ల)తో విరుచుకుపడ్డాడు. స్టార్​ ఓపెనర్ ​డికాక్ ​మూడు బంతుల్లో కేవలం ఒక పరుగు మాత్రమే చేసి వెనుదిరిగాడు. సూర్య కుమార్​ యాదవ్​28 బంతుల్లో 47 పరుగుల చేశాడు. సౌరవ్​తివారి 13 బంతుల్లో 21 రన్స్​ చేశాడు. హర్దిక్​ పాండ్యా 13 బంతుల్లో 18 పరుగులు, పొలార్డ్​ 13(7 బంతుల్లో) పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేశారు. అంతకుముందు టాస్​ గెలిచిన కలకత్తా నైట్​రైడర్స్ ​కెప్టెన్​ దినేశ్​ కార్తీక్​ ఫీల్డింగ్​ ఎంచుకున్నాడు. కేకేఆర్​ బౌలర్స్ ​శివమ్ ​మావి రెండు వికెట్లు తీశాడు. అండ్రు రస్సెల్ ​ఒక వికెట్ ​తీశాడు. మొదటి ఇన్నింగ్స్​లో ముంబై ఇండియన్స్​ 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసి కలకత్తా నైట్ ​రైడర్స్ కు 196 పరుగుల లక్ష్యాన్ని విధించింది.