Breaking News

రో‘హిట్​’.. ముంబై 191

రో‘హిట్​’.. ముంబై 191

అబుదాబి: ఐపీఎల్​13 సీజన్​లో భాగంగా అబుదాబిలో జరిగిన మ్యాచ్​లో కింగ్స్​ లెవన్​ పంజాబ్ కు ముంబై ఇండియన్స్​192 పరుగుల టార్గెట్ ​ఇచ్చింది. చివరి ఓవర్లలో పొలార్డ్​ హ్యాట్రిక్​ సిక్స్​లతో అద్భుతంగా బ్యాటింగ్​చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేశారు. ముంబై కెప్టెన్​ రోహిత్​శర్మ 70(45 బంతుల్లో 8 ఫోర్లు, మూడు సిక్స్​లు) పరుగులు చేశాడు. సూర్యాకుమార్​ యాదవ్​ 10, ఇషాన్​కిషన్​28(32 బంతుల్లో సిక్స్, ఒక ఫోర్​), పొలార్డ్​ 47(20 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్స్​లు), హార్దిక్​పాండ్యా 30(11 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్స్​లు) పరుగులు చేశాడు. కింగ్స్​లెవన్​ పంజాబ్​ బౌలర్లు షెల్డన్​ కాట్రెల్​ ఒకటి, మహ్మద్​షమీ ఒకటి, గౌతమ్ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.