![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/ACCIDENT-FFFG.jpg?fit=700%2C392&ssl=1)
సారథి న్యూస్, మానవపాడు: రోడ్డుప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన ఏపీలోని కర్నూల్ సమీపంలో చోటుచేసుకున్నది. ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మాధవి ఎమ్మిగనూరు నుంచి కర్నూలు జిల్లా పంచలింగాలకు వెళ్తున్నది. ఈ క్రమంలో తుంగభద్ర బ్రిడ్జిపై వెనుక నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధవి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.