Breaking News

రోగాలొస్తయ్.. జాగ్రత్త

రోగాలొస్తయ్.. జాగ్రత్త

సారథి న్యూస్, సిద్దిపేట: మంత్రి టి.హరీశ్​రావు ఆదివారం సిద్దిపేట పట్టణంలోని హనుమాన్ నగర్ వీధిలో పర్యటించారు. ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయాలని, ప్రతి ఆదివారం డ్రై డే పాటించాలని సూచించారు. డెంగీ, చికున్​గున్యా, కలరా వంటి వ్యాధులకు కారణమవుతున్న దోమలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని, తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని అవగాహన కల్పించారు.