Breaking News

రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలి

రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలి

సారథి న్యూస్, మహబూబాబాద్​: సీఎం కేసీఆర్​ రైతును రాజుగా, వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ అన్నారు. బీజేపీ మాయమాటలు చెప్పి రాజకీయ పబ్బం గడుపుకుంటుందని విమర్శించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. అందుకోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. శనివారం మహబూబాబాద్​ జిల్లా కేసముద్రంలో రైతువేదిక భవనం, వ్యవసాయ ప్రాథమిక సహకార కేంద్రం భవనాలను మంత్రి మహబూబాబాద్ ఎంపీ మలోత్ కవితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి పోస్తున్నాయని వివరించారు. డిసెంబర్​28 నుంచి రూ.7,300 కోట్ల రైతుబంధు ఇస్తున్నామని చెప్పారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే పెద్దకర్మ లోపు రూ.ఐదు లక్షల బీమా వర్తిస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ చైర్​పర్సన్​ ఆంగోతు బిందు, పీఏసీఎస్​ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.