![‘రైతువేదిక’లను వేగవంతం చేయాలి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/mdk-jc-2f.jpg?fit=677%2C377&ssl=1)
సారథి న్యూస్, రామాయంపేట: రైతువేదిక పనులను వేగవంతం చేయాలని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్నగేష్ కాంట్రాక్టర్లకు సూచించారు. శనివారం నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో రైతు వేదికలను నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు వేగవంతంగా జరగాలని, నాణ్యతగా ఉండాలని సూచించారు. ఆయన వెంట డీఏవో పరశురాంనాయక్, ఏవో సతీశ్ ఉన్నారు.