Breaking News

రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు

రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు

సారథి న్యూస్​, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న సమయంలో.. రైతన్నలు కష్టకాలంలో ఉన్నవేళ కేంద్ర ప్రభుత్వం వారికి తీపికబురు అందించింది. మహమ్మారి విజృంభిస్తుండడంతో అన్ని రంగాలతో పాటు వ్యవసాయరంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. ఈ క్రమంలో అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వానాకాలం పంటల సీజన్​ను దృష్టిలో ఉంచుకుని వివిధ పంటలకు మద్దతు ధరలు పెంచింది.
ప్రకటించిన మద్దతు ధరలు
వరికి కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరతో కలుసుకుని రూ.1,868(పెంచిన ధర రూ.53), వరి(గ్రేడ్ ‘ఏ’ రకం) కొత్త ధర రూ.1,888, జొన్నలు(హైబ్రీడ్) కొత్త ధర రూ.2,620(పెంచిన ధర రూ.70), జొన్నలు(దేశీయ) కొత్త ధర రూ.2,640(పెంచిన ధర రూ.70), సజ్జలు కొత్త ధర రూ.2,150(పెంచిన ధర రూ.150), మొక్కజొన్నలు కొత్త ధర రూ.1,850(పెంచిన ధర రూ.90), రాగులు కొత్త ధర రూ.3,295(పెంచిన ధర రూ.145), కందులు కొత్త ధర రూ.ఆరువేలు,(పెంచిన ధర రూ.200), పెసర్లు కొత్త ధర రూ.7,196,(పెంచిన ధర రూ.146), మినుములు కొత్త ధర రూ.ఆరువేలు(పెంచిన ధర రూ.300), వేరుశనగ కొత్త ధర రూ.5,275(పెంచిన ధర రూ.185), ప్రొద్దుతిరుగుడు నూతన ధర రూ.5,885( పెంచిన ధర రూ.235), సోయాబిన్ నూతన ధర రూ.3,880(పెంచిన ధర రూ.175), నువ్వులు కొత్త ధర రూ.6,855, ( పెంచిన ధర రూ.370), ఒడిసెలు నూతన ధర రూ. 6,695(పెంచిన ధర రూ.755), పత్తి(మధ్యరకం) నూతన ధర రూ.5,515( పెంచిన ధర రూ.260), పత్తి(పొడవు రకం) కొత్త ధర రూ.5,825(పెంచిన ధర రూ.275).