![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/prabhas-2-f.jpg?fit=954%2C960&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: ‘పుడమి పచ్చగా ఉండాలే.. మన బతుకులు చల్లగా ఉండాలే’ అనే నినాదంతో ఎంపీ(రాజ్యసభ) జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ 3వ దశకు చేరింది. గురువారం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన నివాసంలో మూడు మొక్కలు నాటి మూడోదశ గ్రీన్ ఇండియా చాలెంజ్ కు శ్రీకారం చుట్టారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఉన్నతమైన విలువతో కూడుకున్నదని అన్నారు.