Breaking News

రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. అయితే తాజాగా రామ్ చరణ్ తో వంశీ ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. వంశీ రామ్ చరణ్​కు కథ వినిపించారట. కథలోని కొత్తదనం చరణ్​కు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ‘మహర్షి’ తర్వాత వంశీ ఒక ప్రాజెక్టుతో మహేష్ ను సంప్రదించగా మహేష్ బాబు అంగీకరించాలేదట. ఇప్పుడో కొత్త కథతో రామ్ చరణ్​ను అప్రోచ్ అయ్యారట వంశీ పైడిపల్లి. గతంలో వీరిద్దరి కాంబినేషన్​లో వచ్చిన ‘ఎవడు’ చిత్రం బ్లాక్ బ్లస్టర్​అందుకుంది. ‘మహర్షి’ మేసేజ్ ఓరియెంటెడ్ చిత్రం.. మరి ఈ సినిమా ఏ బాణీలో రానుందో. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు.