Breaking News

రాముడిగా ప్రభాస్​.. మరి సీత?

యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా ప్యాన్​ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్​’ చిత్రంలో హీరోయిన్​ పాత్ర ఎంపిక చిత్రబృందం కసరత్తు చేస్తున్నది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్​ క్రేజ్ పెరిగిపోయింది. ఆయన చేసే ప్రతిసినిమాను పాన్​ఇండియా లెవల్​లోనే తెరకెక్కిస్తున్నారు. ‘సాహో’ దక్షిణాదిన ఆశించిన ఫలితం సాధించకపోయినప్పటికీ.. బాలీవుడ్​లో భారీగా వసూళ్లు రాబట్టింది. కాగా, ప్రస్తుతం భారీ బడ్జెట్​తో తెరకెక్కుతున్న ‘ఆదిపురుష్​’ చిత్రంలో ప్రభాస్​ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి బాలీవుడ్​ దర్శకుడు ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్​ ‘రాముడు’గా కనిపిస్తారని టాక్​. సీత పాత్ర కోసం పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. మొదట కీర్తీసురేశ్​ పేరు వినిపించింది. కాగా ప్రస్తుతం బాలీవుడ్​ భామ కియారా ఆద్వానీ సీత పాత్రలో నటించనున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.