Breaking News

రామడుగులో కరోనా కలకలం

కరోనా రామడుగు ఎమ్మార్వో

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని శిక్షణా అధికారికి కరోనా సోకింది. దీంతో ఇటీవల తహసీల్దార్​ కార్యాలయానికి వెళ్లిన వారంతా ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ సిబ్బంది కార్యాలయాన్ని శానిటైజ్​ చేశారు. పరిసరాలను శుభ్రపరిచారు. రామడుగు మండలంలోని ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్య​ అధికారులు సూచించారు. ఇటీవల రామడుగు తహసీల్దార్​ కార్యాలయానికి వెళ్లిన వారంతా హోం క్వారంటైన్​లో ఉండాలని సూచించారు.