Breaking News

రాత్రి 8 దాకా మద్యం అమ్మకాలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు తీపికబురు చెప్పింది. మరో రెండు గంటల పాటు మద్యం అమ్మకాలకు పర్మిషన్​ ఇస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. కరోనా వ్యాప్తి.. లాక్‌ డౌన్‌ అమలు అనంతరం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైన్స్​ తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే మాత్రమే మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా రాత్రి 8 గంటల వరకు తెరుచుకోవచ్చని ఎక్సైజ్‌ శాఖ పర్మిషన్​ ఇచ్చింది. అయితే కంటైన్​మెంట్​ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో అమ్ముకోవచ్చని తెలిపింది.