![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/RAGINII-DWIVEDIFF.jpg?fit=700%2C394&ssl=1)
డ్రగ్స్ కేసులో ఇటీవల పోలీసులకు దొరికిన కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది.. సీసీబీ అధికారుల ముందు తన సినిమా తెలివితేటలు ప్రదర్శించింది. అధికారులనే బురిడీ కొట్టించాలని చూసి అడ్డంగా దొరికిపోయింది. రాగిణి డ్రగ్స్కేసులో సీసీబీ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సీసీబీ అధికారుల అదుపులో ఉన్నది. ఆయితే ఆమెకు శనివారం బెంగళూరులోని కేసీ జనరల్ ఆస్పత్రుల్లో డ్రగ్స్ టెస్టులు చేశారు. ఇందులో భాగంగా ఆమె యూరిన్ను సేకరించారు అధికారులు. అయితే రాగిణి మాత్రం యూరిన్లో నీళ్లు కలుపుకొని వెళ్లి అధికారులకు ఇచ్చింది. దీంతో పోలీసులు ఈవిడగారి క్రిమినల్ బ్రెయిన్ను పసిగట్టి రెండోసారి శాంపిల్ను తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దర్యాప్తు అధికారి వెల్లడించారు. ‘యూరిన్లో నీళ్లు కలిపిన విషయాన్ని మేము గుర్తించాం. నిజంగా ఇది చాలా సిగ్గు పడాల్సిన చర్య’ అని ఆయన పేర్కొన్నారు. దీంతో మరోసారి ఆమె నుంచి శాంపిల్స్ని సేకరించారు. ఇదిలా ఉంటే ఇదే కేసులో అరెస్ట్ అయిన సంజన సైతం ఆసుపత్రిలో రచ్చ రచ్చ చేసింది. టెస్ట్ చేసే సమయంలో మెడికల్ సిబ్బందికి సహకరించకుండా, పోలీసులతో గొడవపడింది.