Breaking News

రహదారి రక్తసిక్తం.. ఐదుగురు దుర్మరణం

సారథి న్యూస్​, వరంగల్​: వరంగల్​ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్​ రూరల్​ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద లారీ.. కారును ఓవర్​టేక్​ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా కారులో ఉన్న మేకల రాకేశ్​, మేడి చందు, రోహిత్​, సాబిర్​, పవన్​ మృతిచెందారు. మృతులంతా పోచం మైదాన్​కు చెందినవారని సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.