Breaking News

రష్మిక.. లక్కీ గాళ్​

రష్మిక.. లక్కీ గాళ్​

హుషారుగా ఉంటుంది. బాగా యాక్ట్​చేస్తుంది రష్మిక మందాన్న. ఈ ఇయర్​ నేషనల్​ క్రష్​ ఆఫ్ ​ఇండియాగా కూడా సెలెక్ట్​ అయింది. అందుకే అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆల్​రెడీ అల్లు అర్జున్​తో కలిసి ‘పుష్ప’ మూవీ షూటింగ్​తో బిజీగా ఉన్న రష్మిక సడెన్​గా ఓ బాలీవుడ్​ అప్​డేట్​తో ట్విటర్​లో ప్రత్యక్షమైంది. సిద్ధార్థ్ ​మల్హొత్రా హీరోగా బాలీవుడ్ ​కొత్త డైరెక్టర్​ శాంతను బగ్​ చీ రూపొందించనున్న ‘మిషన్​మజ్ను’లో రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. మూవీ స్టార్టింగ్​లో హీరోయిన్​గా రష్మిక పేరు వినిపించినా అఫీషియల్​ కన్​ఫర్​మేషన్​ రానందున అది డౌట్​గానే ఉండింది. ఇప్పుడు తనే స్వయంగా రివీల్​చేయడంతో ఆ డౌట్​కాస్త తీరిపోయింది. పాకిస్థాన్ లో భార‌త సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేప‌ట్టిన అతిపెద్ద కోవ‌ర్ట్ ఆప‌రేష‌న్ జరిపింది. ఆ రియల్​ ఇన్సిడెంట్స్​ ఆధారంగా ఈ​స్టోరీ తెరకెక్కనుంది. ఇందులో హీరో సిద్ధార్థ రా ఏజెంట్​గా కనిపించనున్నాడు. పర్వీజ్​షేక్, అసీమ్ ఆరోరా, సుమిత్ బతేజా రాసిన ఈ కథను రోనీ స్క్రూవాలా, అమర్​బుటాలా, గరిమా మెహతా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2021 ఫిబ్రవరిలో సెట్స్ ​పైకి వెళ్లనుంది. ఈ ప్రెస్టీజియస్​ప్రాజెక్ట్ ద్వారా బాలీవుడ్​లో అడుగుపెడుతున్నందుకు తెగ ఆనంద పడుతోంది రష్మిక. ఆమె నటించిన కన్నడ, తెలుగు భాషల మూవీ ‘పొగరు’ రిలీజ్ కు రెడీగా ఉంది. తమిళంలో కార్తీతో కలిసి ‘సుల్తాన్’ చిత్రంలో నటిస్తోంది. టాలీవుడ్​లో ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ శర్వానంద్​ హీరోగా రూపొందనున్న చిత్రంలో కూడా రష్మికనే హీరోయిన్​గా అనుకుంటున్నారు. మొత్తానికి తెలుగు, తమిళ, కన్నడంలోనే కాకుండా ఈ మూవీతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టేస్తున్న రష్మిక లక్కీ గాళే..