Breaking News

రకుల్​ వెంటపడ్డ కోన వెంకట్​

మల్లీశ్వరి బయోపిక్​లో రకుల్​

టాలీవుడ్​లో పూజాహెగ్డే, రష్మికా మందన్నా ఎంట్రీతో రకుల్​ ప్రీత్​సింగ్ జోరు తగ్గింది. దీంతో ఆమె టాలీవుడ్​ను వదిలి ముంబైకి పరుగులు తీసింది. అయితే అక్కడా అవకాశాలు రాకపోవడంతో.. ప్రస్తుతం హైదరాబాద్​లోనే ఉంటూ తన వ్యాపారాలు చూసుకుంటుంది. ఈ క్రమంలో రకుల్​కు ఓ భారీ ఆఫర్​ వచ్చినట్టు టాక్​. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్​ ఒలింపిక్​​ మెడల్​ విజేత కరణం మల్లీశ్వరిపై ఓ బయోపిక్​ను తీయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రకుల్​ టైటిల్​ రోల్​ చేస్తున్నట్టు టాక్​. ముందుగా ఈ పాత్రకు సమంతను ఎంపికచేసినప్పటికీ ఫైనల్​గా రకుల్​కే అవకాశం దక్కిందట. భారీగా బరువులు ఎత్తడం, కసరత్తులు చేయడం రకుల్​గా బాగా అలవాటు కాబట్టి ఆమెను ఈ పాత్రకు ఎంపికచేసినట్టు టాక్​. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.