![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/mulugu-2-final-1.jpg?fit=276%2C157&ssl=1)
సారథి న్యూస్, ములుగు: ములుగు అంటేనే అడవులు ఉన్న ప్రాంతమని, అడవిని చూసినప్పుడు చెట్లు లేకపోవడం బాధేసిందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం ఆమె ములుగు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఉపాధి హామీ, హరితహారం పథకాలపై సమీక్షించారు. అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కృష్ణఆదిత్య, జడ్పీ సీఈవో పారిజాతం, జడ్పీ చైర్మన్ జగదీష్, పీవో హనుమంతు పాల్గొన్నారు.