Breaking News

‘ముంబై’ మెరిసింది

‘ముంబై’ మెరిసింది

  • రోహిత్ శర్మ వీరోచిత బ్యాటింగ్​
  • కలకత్తా నైట్​ రైడర్స్ ఓటమి

అబుదాబి: ఐపీఎల్​13వ సీజన్​లో భాగంగా కలకత్తా నైట్​రైడర్స్(కేకేఆర్​)​పై 49 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ​జట్టు ఘనవిజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు చేయాల్సి ఉండగా, 146 పరుగుల వద్దే కేకేఆర్​ చేతులేత్తేసింది. తొలుత టాస్​ గెలిచిన కలకత్తా నైట్​రైడర్స్ ఫీల్డింగ్ ​ఎంచుకుంది. ముంబై కెప్టెన్ ​రోహిత్ శర్మ ​వీరోచిత బ్యాటింగ్ 80(54 బాల్స్​లో 6 సిక్స్​లు, మూడు ఫోర్ల) చేశాడు. సూర్యకుమార్​యాదవ్​28 బంతుల్లో 47 పరుగుల చేశారు. సౌరవ్ ​తివారీ 13 బంతుల్లో 21 రన్స్​చేశాడు. హర్దిక్​ పాండ్యా 13 బంతుల్లో 18 పరుగులతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేశారు. కేకేఆర్​ బౌలర్లు శివమ్ ​మావి రెండు వికెట్లు తీశాడు. అండ్రు రస్సెల్, నరైన్ ​​చేరో వికెట్ తీశారు.
అనంతరం బ్యాటింగ్​కు దిగిన కలకత్తా నైట్​రైడర్స్ ​జట్టు ఓపెనర్లు శుభమన్ ​గిల్​7(11 బంతుల్లో), ఎస్పీ నరైన్​10(9 బంతుల్లో) పరుగులతో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఆ తర్వాత వచ్చి కేడీ కార్తీక్​30(23 బంతుల్లో), ఎన్​రానా 24(18 బంతుల్లో ) నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా.. క్రీజ్​లో ఎంత సేపూ నిలవలేదు. జట్టులో పీజే కమిన్స్​ 33(12) తప్ప పెద్దగా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. 20 ఓవర్లలో 146 స్కోరు వద్దే ఆలౌటయ్యారు. ముంబై ఇండియన్స్​ బౌలర్లు టీఏ బౌల్ట్​ 2, జేఎల్​పాటిసన్​ 2, బుమ్రా 2, ఆర్​డీ చాహర్​2, కేఏ పొలార్డ్ఒకటి చొప్పున వికెట్లు తీసుకున్నారు. ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​ గా రోహిత్​శర్మ నిలిచారు.