Breaking News

సుశాంత్​ కేసు.. బాలీవుడ్​ బ్యూటీ ఫైర్​

తనూశ్రీ దత్తా హాట్​ కామెంట్స్​

ముంబై: సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ ఆత్మహత్య బాలీవుడ్​లో తీవ్ర దుమారం సృష్టిస్తున్నది. ఇప్పటికే బాలీవుడ్​లోని నెపోటిజంపై పలువురు సీనీ నటులు, ప్రముఖులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్​ అందాల భామ తనూశ్రీ దత్తా సుశాంత్​ కేసుపై స్పందించారు. ముంబై పోలీసులు సుశాంత్​ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారేమోనని తనకు అనుమానంగా ఉన్నదని ఆమె పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడమే ఉత్తమమని ఆమె వ్యాఖ్యానించారు. ముంబై పోలీసులను పూర్తిగా నమ్మలేమని ఆమె వ్యాఖ్యానించారు. వారు రాజకీయనాయకుల ఒత్తిడులకు తలొగ్గుతారని పేర్కొన్నారు.