![తనూశ్రీ దత్తా హాట్ కామెంట్స్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/TANUUUFFFF.jpg?fit=700%2C394&ssl=1)
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో తీవ్ర దుమారం సృష్టిస్తున్నది. ఇప్పటికే బాలీవుడ్లోని నెపోటిజంపై పలువురు సీనీ నటులు, ప్రముఖులు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ అందాల భామ తనూశ్రీ దత్తా సుశాంత్ కేసుపై స్పందించారు. ముంబై పోలీసులు సుశాంత్ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారేమోనని తనకు అనుమానంగా ఉన్నదని ఆమె పేర్కొన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించడమే ఉత్తమమని ఆమె వ్యాఖ్యానించారు. ముంబై పోలీసులను పూర్తిగా నమ్మలేమని ఆమె వ్యాఖ్యానించారు. వారు రాజకీయనాయకుల ఒత్తిడులకు తలొగ్గుతారని పేర్కొన్నారు.