Breaking News

‘ముంబై’దే మరోసారి పైచేయి

‘ముంబై’దే మరోసారి పైచేయి

అబుదాబి: ఐపీఎల్​ 13 సీజన్​లో అబుదాబిలో జరిగిన మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​ మరోసారి చేయి సాధించింది. రాజస్థాన్​ రాయల్స్​ లక్ష్యసాధనలో చేతులెత్తేసింది. ముంబై రాజస్థాన్​పై 57 పరుగుల తేడా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్​ చేపట్టిన ముంబై ఓపెనర్లు డికాక్ 23 (15 బంతుల్లో, 3 ఫోర్లు, ఒక సిక్స్​), రోహిత్​శర్మ 35 (23 బంతులు, 2 ఫోర్లు, 3 సిక్స్​లు), సూర్యాకుమార్​ యాదవ్ 79 (47 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్​లు) పరుగులతో ఆకట్టుకున్నాడు. హార్ధిక్​పాండ్యా 30( 19 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్​) పరుగులతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్​బౌలర్లలో ఎస్​ గోపాల్ ​రెండు, అర్చర్, కార్తీక్​త్యాగి చేరో వికెట్​చొప్పున తీశారు.
అనంతరం లక్ష్యఛేదనకు దిగిన రాజస్థాన్ ​రాయల్స్​ ఆరంభంలోనే తడబడింది. స్టార్ ​ఓపెనర్​ జేసీ బట్లర్​ 70 (44 బంతులు, 4 ఫోర్లు, 5 సిక్స్​లు) పరుగులతో రాణించాడు. జేసీ అర్చర్ 24( 11 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్​), టీకే కురాన్​15 పరుగులు చేశారు. మిగతావారు రెండంకెల స్కోరును దాటలేదు. 18.1 ఓవర్ల 136 పరుగులకే అలౌట్​ అయ్యారు. ఇక ముంబై బౌలర్లలో బుమ్రా నాలుగు, బౌల్ట్, పాటిస్సన్ ​చెరో రెండు, చాహర్, పొలార్డ్​ఒకటి చొప్పున వికెట్లు తీశారు.